Telugu Updates
Logo
Natyam ad

యోగా దినోత్సవంను విజయవంతం చేయాలని వాక్ ఫర్ యోగా

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఈనెల 21న నిర్వహించబోయే తొమ్మిదవ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం మంచిర్యాల బాలుర పాఠశాల మైదానం నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు వాక్ ఫర్ యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యోగ డే ఆహ్వాన కరపత్రాలు విడుదల చేస్తూ, యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, బెల్లంపల్లి చౌరస్తా యందు యోగ సభ్యులు పలు ఆసనాలతో అలరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 మంచిర్యాల బాలుర మైదానంలో ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయగలరని,పలు యోగా సంస్థల సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు,సభ్యులు మహిళలు, చిన్నారులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు…