Telugu Updates
Logo
Natyam ad

పేకాట ఆడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కొంతమంది ఉపాధ్యాయులు పేకాట ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చిన వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై తెలంగాణ గేమింగ్ ఆక్ట్-2017 ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.