Telugu Updates
Logo
Natyam ad

తెరాస ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.