సాగు దండగ అన్న తెలంగాణలో నేడు అదే పండగ అయిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో సాగు పండగ అయిన రోజే సంపూర్ణ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దేశ, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా మకర సంక్రాంతిని సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలన్నారు. సాగులో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే మార్గదర్శనమన్నారు. సాగు దండగ అన్న తెలంగాణలో నేడు అదే పండగ అయిందని పేర్కొన్నారు. దేశంలో సాగు పండగ అయిన రోజే సంపూర్ణ సంక్రాంతి అని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.