Telugu Updates
Logo
Natyam ad

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలంలోని గుడిపేట వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుడిపేటలోని ప్రధాన రహదారిపై మంచిర్యాల నుండి లక్షెట్టిపేట వైపు వెళుతున్న కారు లక్షెట్టిపేట వైపు నుంచి మంచిర్యాలకు వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ఉన్న పర్రె చిన్నికృష్ణ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.