Telugu Updates
Logo
Natyam ad

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య, కేసులో ముద్దాయికి  ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగ్గా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు…