Telugu Updates
Logo
Natyam ad

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న దేవేందర్ (19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఈ ఘటనపై ఆర్మూర్ ఏసీపీ మీడియాతో మాట్లాడారు. మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.