Telugu Updates
Logo
Natyam ad

స్థాయి కమిటీ సమావేశాలు.

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 30వ తేదీన స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉ దయం 10 నుండి 11 గం||ల వరకు స్థాయి కమిటీ-2 (గ్రామీణాభివృద్ధి), ఉదయం 11 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు స్థాయి కమిటీ-3 (వ్యవసాయం), మధ్యాహ్నం 12 నుండి 1 గం॥ల వరకు స్థాయి కమిటీ-4 (విద్య, వైద్య సేవలు), మధ్యాహ్నం 1 గం॥ల నుండి 2 గం||ల వరకు స్థాయి కమిటీ-5 (మహిళ సంక్షేమం), మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గం||ల వరకు స్థాయి కమిటీ-6 (సాంఘిక సంక్షేమం), సాయంత్రం 4 నుండి 5 గం||ల వరకు స్థాయి కమిటీ-7 (నిర్మాణ పనులు), స్థాయి కమిటీ-1 (ప్రణాళిక, ఆర్థిక) సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.