Telugu Updates
Logo
Natyam ad

వ్యక్తి పై కత్తులతో దాడి..!

జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని భీమని దుబ్బ ప్రాంతానికి చెందిన తోకల జనార్దన్ పై సోమవారం సాయంత్రం కత్తులతో దాడి చేసిన సంఘటన కోరుట్లలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తోకల జనార్ధన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య మనస్పర్థలు రావడంతో సర్ఫరాజ్ పూర్ కు చెందిన వ్యక్తులు దాడి చేసారు. జనార్ధన్ ఇంటి లోకి వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి కడుపులో, చేతుపైన పొడిచారు.

అడ్డం వచ్చిన కూతురు కు చేతుపై స్వల్పగాయలు అయి రక్తస్రావం కావడంతో వెంటనే కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.