సామాన్యులతో కలిసి హోటల్ లో అల్పాహారం చేసిన: ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద రోడ్డుపై గల టిఫిన్ సెంటర్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం అల్పాహారం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సామాన్యులతో కలిసి టిఫిన్ చేయడం పట్ల ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు..

Comments (0)
Add Comment