చేపల లారీ బోల్తా.. అరగంటలో లోడు ఖాళీ..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బోల్తా పడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వారించినా.. వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. 2 కేజీల బరువుండే సుమారు 4వేల చేపలు ఉన్న లారీ లోడ్ ను అరగంటలో ఖాళీ చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళుతుండగా లారీ ప్రమాదానికి గురైంది..

Comments (0)
Add Comment