ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం..

ధిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోకల్పురి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనమయ్యారు. ఆ ప్రాంతంలోని దాదాపు 60 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 13 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోకల్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అక్కడి తమ బృందాలు చేరుకున్నాయని.. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని ఈశాన్య దిల్లీ అడిషనల్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ విచారం వ్యక్తం చేశారు..

Comments (0)
Add Comment