Telugu Updates
Logo
Natyam ad

ఎయిర్ గన్ తో తెరాస నాయకుల కాల్పులు

రంగారెడ్డి జిల్లా: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. మండలం మీరన్పేట్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్వీ కందుకూరు అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మరో నాయకుడు విక్రమ్.. తుపాకీతో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.. అనంతరం తుపాకీ, బుల్లెట్లు స్వాదినం చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు..